భక్తులను ఆకట్టుకుంటున్న రంగమన్నారు పేట 'మహా గణపతి'

61చూసినవారు
శ్రీలక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు పట్టణంలోని రంగమ్మన్నారు పేట, దాసు గుడి వీధిలో ఏర్పాటు చేసిన భారీ వినాయక స్వామి అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నాడు. మహా గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం అర్చకులు ఈరంకి కాశి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్