పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు (ఆగస్టు 31వ తేదీ శనివారం) పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కచ్చితంగా సెలవును అమలు చేయాలని ప్రకటనలో ఆదేశించారు.