తాడేపల్లిగూడెం: ఆసుపత్రుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి

74చూసినవారు
తాడేపల్లిగూడెం: ఆసుపత్రుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి
పెంటపాడు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్యులు ఆసుపత్రికి వచ్చిన ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యుల సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్