ఐక్యంగా పనిచేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది: ఎమ్మెల్యే

74చూసినవారు
ఐక్యంగా పనిచేస్తేనే గ్రామం అభివృద్ధి  చెందుతుంది: ఎమ్మెల్యే
ఐక్యంగా పనిచేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల, పెంటపాడు మండలం పడమరవిప్పర్రు గ్రామాల్లో పలు రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. వర్గాలుగా విడిపోతే గ్రామాలు అభివృద్ధి చెందవన్నారు. అధికారులు ఎవరైనా సొమ్ములు అడిగితే తనకు చెప్పాలన్నారు. ఎంపీపీ హైమావతి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్