తణుకులో అదాలత్ 123 కేసులు రాజీ

75చూసినవారు
తణుకులో అదాలత్ 123 కేసులు రాజీ
తణుకు కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్ లో 123 కేసులను రాజీ చేయడం జరిగిందని నాలుగో అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సివిల్ కేసులు 25, క్రిమినల్ కేసులు 60, చెక్ బౌన్స్ కేసులు 5, ఎంసీ కేసులు 4, టెలిఫోన్ బకాయి కేసులు 26, బ్యాంకు బకాయి కేసులు 3 రాజీ చేసినట్లు వెల్లడించారు. మొత్తం రూ. 56. 45 లక్షలు ఇరు పార్టీలు ఇచ్చి పుచ్చుకునేలా రాజీ చేశారు.

సంబంధిత పోస్ట్