స్వల్పంగా పెరిగిన ఉప్పుటేరు నీటిమట్టం

70చూసినవారు
స్వల్పంగా పెరిగిన ఉప్పుటేరు నీటిమట్టం
కొల్లేరులో వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం కొల్లేరుతో పాటు ఉప్పుటేరులో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. మంగళవారం సాయంత్రానికి కొల్లేరులో నీటి మట్టం 3. 42 మీటర్లకు చేరింది. గత 10 రోజులతో పోలిస్తే పెరుగుదల నెమ్మదించింది. ఉప్పుటేరులో మాత్రం నీటి ఉద్ధృతి పెరిగి మంగళవారం సాయంత్రానికి 2. 55 మీటర్లకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్