ఉంగుటూరు: గోకులం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

50చూసినవారు
ఉంగుటూరు: గోకులం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ఉంగుటూరు మండలంలో పాడి రైతులకు ప్రభుత్వం పశువుల షెడ్లు నిర్మాణం, పాడి గేదెల కొనుగోలు కోసం 38 యూనిట్లు మంజూరు చేసిందని పశు వైద్యాధికారి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఒక్కో షెడ్ కి రూ. 2. 30 లక్షలు ఇవ్వనుంది. ఇందులో పాడి రైతు 30% వాటా కాగా మిగతా 70 శాతం ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వనుంది. నారాయణపురంలో ఎంపికైన లబ్ధిదారుడు తిర్లంగి నరసారావు షెడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. జనసేన, టీడీపీ నాయకులు, మాజీ ఎంపీపీ గోలి శ్రీనివాసరావు, గురువెల్లి ప్రసాద్, తమ్మినేని సాయి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్