ఉంగుటూరు: వ్యాసరచన పోటీల్లో నారాయణపురం బాలికకు రెండో స్థానం

72చూసినవారు
ఉంగుటూరు: వ్యాసరచన పోటీల్లో నారాయణపురం బాలికకు రెండో స్థానం
వ్యాసరచన పోటీల్లో ఉంగుటూరు మండలం నారాయణపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కావ్య శ్రీకి ఏలూరు జిల్లాలో రెండో స్థానంలో ఎంపికైంది. ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలను నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో శుక్రవారం ఏలూరులో జరిగిన బహుమతుల పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి బాలికకు మెమెంటోతో పాటు రూ. 3000 నగదు బహుమతి అందించారు.

సంబంధిత పోస్ట్