సీఎం జగన్పై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. "సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రమంతా పోస్టర్లు పెడుతున్నారు. జగన్ అబద్ధాలు చెప్పబోనన్నారు.. కానీ, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, మెగా డీఎస్సీతో పాటు అనేక హామీలు ఇచ్చారు. ఏవీ నెరవేర్చలేదు. అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది." అని పవన్ వ్యాఖ్యానించారు.