తెలుగుదేశంలోకి మాజీ మంత్రి..?

1058చూసినవారు
తెలుగుదేశంలోకి మాజీ మంత్రి..?
మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. విజయవాడలోని తన కార్యాలయంలో మంగళవారం రాత్రి టిడీపీ నేతలతో పార్థసారథి భేటీ అయ్యారు. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, బొమ్మసాని సుబ్బారావులు వచ్చి సారథితో చర్చించారు. సారథిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈనెల 18న టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్