శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతుల ఆగ్రహం

58చూసినవారు
శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతుల ఆగ్రహం
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెద్దపులిపాకలో హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు మాట్లాడారు. ‘‘ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదు’’ అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్