మున్నూరుకాపులకు తెలంగాణ మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్, BRS, BJP నేతలు కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు నివాసంలో సమావేశమయ్యారు. కులగణన సరిగ్గా చేయలేదని, తమ సామాజిక వర్గం సంఖ్యను తగ్గించారని పేర్కొన్నారు. దీనిపై త్వరలో మున్నూరు కాపుల సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఒకే సమావేశానికి మూడు పార్టీల నేతలు హాజరవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.