పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం యన్నాదేవి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సత్తెనపల్లి వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో కట్టవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల వెంకట రామిరెడ్డి (55) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.