ఫోరెన్సిక్ బృందం బుధవారం ఉదయం హాత్రాస్ లో తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టింది. డాగ్ స్క్వాడ్తో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హత్రాస్కు ఈవాళ రానున్నారు. ఈ ప్రమాదంపై ఎడీజీ, ఆగ్రా, అలీఘర్ కమీషనర్ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటు చేయబడింది. వచ్చే 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. పలువురు మంత్రులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.