ఏపీలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు.. కొవ్వూరు ఏబీఎన్ డిగ్రీ కాలేజీ వద్ద డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.