ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి

77చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అలాగే చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం బసవరాజు వద్ద అనంతపురం నుంచి తమిళనాడు వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రయాణికులు చనిపోగా.. 10 మందికి గాయాలయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్