అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్కు గురై ఐదేళ్ల చిన్నారి మరణించింది. డీ.హీరేహాల్ మండలం మురడి గ్రామానికి చెందిన అర్పిత ఆడుకుంటూ కరెంట్ వైరుకు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగిలి స్పాట్లోనే మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.