AP: రాష్ట్రంలో "మత్స్యకార భరోసా" పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలులోకి తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఈ పథకం మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించినది. అలాగే, డీజిల్ సబ్సిడీ కింద లీటర్కి రూ.9 తగ్గింపు కూడా ఇస్తుంది. అందువల్ల మోటర్ పడవల్ని ఉపయోగించే మత్స్యకారులకు డీజిల్ ఖర్చు తగ్గుతుంది. ఈ సహాయం సాంప్రదాయ పడవలతో వేట చేసే వారికి మాత్రమే వర్తించనుంది.