అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామాలు చేసి.. వేరే పార్టీలలోకి జంప్ అవుతున్నారు. తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.