కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం తప్పింది. బెంగళూరు జిల్లాలోని హస్కూర్లో 120 అడుగుల పొడవైన రథం ఒక్కసారిగా బోల్తా పడింది. స్థానిక శ్రీ మధురమ్మ దేవాలయంలో ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు నిండా ఇసుక, రాళ్లు ఎక్కువగా ఉండడంతో రథం అదుపుతప్పి కిందపడింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.