కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త

61235చూసినవారు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తోన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవి కాలాన్ని మరో ఏడాదికి పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చితోనే వారి గడువు ముగియగా.. ఆయా విభాగాధిపతుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పదవి కాలాన్ని పొడిగించింది.

సంబంధిత పోస్ట్