వైసీపీకి బుట్టా రేణుక గుడ్‌బై.. క్లారిటీ

74చూసినవారు
మాజీ ఎంపీ బుట్టా రేణుక వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేర‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. "నేను వైసీపీని వీడుతున్న‌ట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొన్ని మీడియా ఛానళ్లు కావాలనే తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ఇప్పటికీ బలంగా ఉంది.. మాకు 40 శాతం ఓట్లు వచ్చాయి." అని పేర్కొన్నారు. తాజాగా ఎమ్మిగ‌నూరు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన రేణుక ఓట‌మి చెందారు.

సంబంధిత పోస్ట్