రామోజీరావు తనకు సంగీత దర్శకుడిగా జన్మనిచ్చారని కీరవాణి గుర్తుచేసుకున్నారు. ‘రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. వారిలా ఒక్కరోజు జీవించినా చాలని గతంలో చెప్పా. కానీ మరణించినా ఆయనలాగే కన్నుమూయాలని ఇప్పుడు చెబుతున్నాను. భీష్ముడు తాను అనుకున్నప్పుడే దేహాన్ని విడిచారు. అదే తరహాలో రామోజీ కూడా కబంధ హస్తాల నుంచి ఏపీ విడుదలైన తర్వాతే స్వర్గస్థులయ్యారు’ అని రామోజీ సంస్మరణ సభలో అన్నారు.