T20 WCలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ టాస్ ఆలస్యంగా వేయనున్నారు. వర్షం ఆగి కాస్త ఎండ వచ్చినట్లుంది. దీంతో భారత ప్లేయర్లు మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అంపైర్లు 8.30 గంటలకు మైదానం, పిచ్ను పరిశీలిస్తారు. టాస్పై అప్పుడే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాస్ ఆలస్యం అయిన సంగతి తెలిసిందే.