ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

73చూసినవారు
ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 1.2 లక్షల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ‘ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీమ్’ కింద వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంతో కలిసి ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్‌‌ల వినియోగం, వీధి దీపాల నిర్వహణలో ఎలక్ట్రీషియన్ల సేవలను వినియోగించుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్