పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేసిన జీఆర్పీ పోలీసులు

59చూసినవారు
రైల్వే ప్రయాణికులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను గుంటూరు జీఆర్పీ పోలీసులు గుర్తించి అప్పగించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు జిఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్లు పోయాయని ఇచ్చిన ఫిర్యాదు పై డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకటాద్రి, రమేశ్ దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి, గురువారం 16 మందికి రూ. 3. 40 లక్షల విలువచేసే ఫోన్లు అందజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్