యువతి ఫిర్యాదుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి పై ఆదివారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గుంటూరు శ్యామల నగర్ కు చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా హైదరాబాదులో పని చేస్తున్నారు. ఆమె బీటెక్ చదివే సమయంలో నగరంపాలెంకు చెందిన శ్రీనివాస కుమార్ పరిచయమై తనను పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు. ఇటీవల శ్యామలనగర్ కు వచ్చిన తనతో ఆ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేసింది.