వికలాంగ పెన్షన్ ఇప్పించాలి: బాధితురాలు మహాలక్ష్మి

75చూసినవారు
తాను వికలాంగురాలిని అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని, గుంటూరు గోరంట్లకు చెందిన మహాలక్ష్మి అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 2021 వరకు వికలాంగ పెన్షన్ ఇచ్చి అకస్మాత్తుగా నిలిపివేశారని చెప్పారు. 300 యూనిట్ల కరెంట్ బిల్లు నిబంధన పేరుతో పెన్షన్ రద్దు చేశారని తెలిపారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు అందించారు.

సంబంధిత పోస్ట్