బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గుంటూరు ఎంపీ అభ్యర్థి

63చూసినవారు
బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గుంటూరు ఎంపీ అభ్యర్థి
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని దేవి ప్రియ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగినది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు ఎంపీ వైసిపి అభ్యర్థి పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పాల్గొని ఉపన్యసించారు. కిలారి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు చేస్తున్న అభ్యున్నతి గురించి వివరించి జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి అండగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్