తుళ్లూరులో ఇనుము దొంగలు అరెస్టు

61చూసినవారు
తుళ్లూరులో ఇనుము దొంగలు అరెస్టు
రాజధాని కోర్ క్యాపిటల్ నిర్మాణాల వద్ద ఇనుము చోరీ ఘటనలో నిందితులను తుళ్లూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన గంగరాజు, తిరుపతిరాజు, ఓం ప్రకాష్ యాదవ్ అనే ముగ్గురి ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. లక్ష విలువ చేసే ఇనుప నిర్మాణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలో చోరీలను అరికట్టడానికి స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్