భార్య పై అనుమానంతో కత్తితో పొడిచిన భర్త

55చూసినవారు
భార్య పై అనుమానంతో భర్త కత్తితో పొడిచిన ఘటన శుక్రవారం జరిగింది. తెనాలికి చెందిన కీళ్ల రవి(38), మానస(28)కు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజులుగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్తపేటలోని ఒక కార్యాలయంలో భార్య మానస మీద అనుమానంతో భర్త రవి కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్