అద్దంకి: పేకాట శిబిరంపై పోలీసుల దాడులు

78చూసినవారు
అద్దంకి: పేకాట శిబిరంపై పోలీసుల దాడులు
అద్దంకి పట్టణంలోని గుండ్లకమ్మ సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో శనివారం అద్దంకి ఎస్.ఐ ఖాదర్ బాషా తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.5240 స్వాధీనం చేసుకొన్నారు. అలాగే సదరు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్