చీరాలలోని మార్క్స్ లోదరన్ జూనియర్ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్న గారపాటి మంజులాదేవికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి శుక్రవారం డాక్టరేట్ లభించింది. మత్స్యకారుల సంఘం ఆర్థిక అభివృద్ధి అనే శీర్షికపై ఆమెకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పుష్పరాజు, కళాశాల బృందం ఆమెకు అభినందనలు తెలిపారు.