ఎల్ హెచ్ ఎం ఎస్ సేవలు సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

85చూసినవారు
ఎల్ హెచ్ ఎం ఎస్ సేవలు సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్ హెచ్ ఎం ఎస్) ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ మంగళవారం పిలుపునిచ్చారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకు ఎల్ హెచ్ ఎం ఎస్ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని, ఈ యాప్ ను అందరూ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రజల అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చోరీలు జరగకుండా ఈ యాప్ ఉపకరిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్