గుంటూరు నగరాన్ని చెత్తమయంగా మార్చారు: ఆళ్లహరి

80చూసినవారు
గుంటూరు నగర కమిషనర్, మేయర్ తమ అసమర్థ పాలనతో నగరాన్ని చెత్తమయంగా, దుర్గంధమయంగా మార్చారని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి విమర్శించారు. శనివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతుంటే పారిశుధ్య చర్యలు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలకు రక్షిత మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో నగరపాలక సంస్థ ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్