డ్రగ్స్ జోలికి వెళితే జీవితం అంధకారమే: ఆర్డీవో శ్రీకర్

73చూసినవారు
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు ఆర్డీవో శ్రీకర్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం చేపట్టిందని వివరించారు. సోమవారం గుంటూరులో అవగాహన ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వ్యసనానికి యువత బానిసలు కావద్దని ఆర్డీవో కోరారు. డ్రగ్స్ జోలికి వెళితే జీవితం అంధకారమే అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్