నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

81చూసినవారు
నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
తాడికొండ మండలం మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను వారం రోజులు వాయిదా వేసింది. కాగా మరియమ్మ హత్య కేసులో నందిగం సురేశ్ ను 78వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో పోలీసులు ఇటీవల ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్