సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరిన వైవీ సుబ్బారెడ్డి

73చూసినవారు
దేశంలో ఎక్కడా చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచమైన వ్యాఖ్యలు చేశారని రాజ్యసభ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారని అన్నారు. వైసీపీ హయంలో ఎటువంటి నీచమైన అక్రమమైన కార్యక్రమాలు జరగలేదని తన కుటుంబంతో వచ్చి ప్రమాణం చేస్తానని సవాలు విసిరారు.

సంబంధిత పోస్ట్