ఉద్యోగం పేరిట మోసం

64చూసినవారు
ఉద్యోగం పేరిట రూ. 25 లక్షలు తీసుకొని తన అల్లుడిని లండన్ లో వదిలేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని అమీనాబాద్ చెందిన బత్తుల గాయత్రీదేవి వేడుకుంటున్నారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు నసీర్, ఆనంద్ బాబు గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో గాయత్రీదేవి వారికి ఫిర్యాదు చేసి అల్లుడు ఎట్టకేలకు వచ్చాడన్నారు. నిందితుడు అశోక్ పై కేసు నమోదు చేసి డబ్బులు ఇప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్