ప్రజాదర్బార్ కు వెల్లువెత్తిన విన్నపాలు

50చూసినవారు
ప్రజాదర్బార్ కు వెల్లువెత్తిన విన్నపాలు
ఉండవల్లిలోని నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్ కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. 2 కిడ్నీలు పాడైపోయిన తనకు డయాలసిస్ కోసం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన నాగేంద్రబాబు మంత్రిని కోరాగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్