నూతలపాడులో ఘర్షణ - ఆరుగురికి గాయాలు

6642చూసినవారు
బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో ఇరువర్గాల మధ్య సోమవారం ఉదయం జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని పరస్పరం ఇరువర్గాలు గ్రామ నడిబొడ్డున కర్రలతో దాడులకు తెగబడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసు బలగాలను వహించారు పోలీసు బలగాలను మోహరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్