జలమయంగా మారిన అమరావతి పోలీస్ స్టేషన్

80చూసినవారు
అమరావతి మండలం అమరావతి పోలీస్ స్టేషన్ వరద నీటిలో మునిగిపోయింది. జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటితో జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అమరావతి పోలీస్ స్టేషన్ చుట్టూ వరద నీరు చేరుకుంది. పోలీస్ సిబ్బంది స్టేషన్లోకి చేరిన నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్