టిడిపిలో చేరిన పొన్నూరు ఆర్యవైశ్యులు..

2580చూసినవారు
టిడిపిలో చేరిన పొన్నూరు ఆర్యవైశ్యులు..
పొన్నూరు పట్టణంలోని పలు వార్డులకు చెందిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆదివారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో తెదేపా కార్యాలయంలో పార్టీలో చేరారు. ధూళిపాళ్ల వారిని ఆహ్వానించి కండువా కప్పారు. ఈసందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ పొన్నూరు పట్టణంలో తెదేపా గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. జనసేన, తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్