వీధి కుక్కల సంచారం భయాందోళనలో ప్రజలు

71చూసినవారు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా నడివీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత వారంలో కుక్కల దాడికి ఇద్దరు వ్యక్తులు గాయపడిన సందర్భాలు లేకపోలేదు. రోడ్డుపై తిరుగుతూ వాహన చోదకులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. గ్రామ సచివాలయ సిబ్బందికి ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజలు గురువారం మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్