పర్యావరణ పరిరక్షణ పై పాఠశాల విద్యార్థుల ర్యాలీ

52చూసినవారు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద గురువారం కాకుమాను మండలం కాకుమాను జడ్పీహెచ్ హైస్కూల్ విద్యార్థులచే గ్రామంలో 'మదర్ ఫర్ ప్లాంట్ ' ర్యాలీ జరిగింది. మొక్కలు నాటడం వలన జీవ ప్రాణికోటి ఆరోగ్యంగా జీవిస్తుందని విద్యార్థులు ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక బృందం గ్రామంలో 125 మొక్కలను నాటారు. ఏపీవో కే సింగారావు, ఎంఈఓ కెనాడి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్