అగ్ని ప్రమాదంలో నాలుగు గడ్డివాములు దగ్ధం

79చూసినవారు
రేపల్లె పట్టణంలోని 25 వ వార్డులో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు వరిగడ్డి వాములు దగ్ధమయ్యాయి. రేపల్లె మౌంట్ ఫోర్సు స్కూలు రోడ్ లో కొలుసు గోవిందు కు చెందిన ఆరెకరాల గడ్డివామి, కొలుసు శ్రీనివాసరావు చెందిన 6 ఎకరాలు, పులుసు శివరామకృష్ణకు చెందిన ఆరెకరాలు, గొరపతి శ్రీనివాసరావుకి చెందిన ఏడు ఎకరాలు అగ్నికి ఆహుతి అయింది. వెల్డింగ్ షాప్ నుండి నిప్పురవ్వలు ఎగసిపడి అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్