మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో గురువారం గ్రామ సమైక్య మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల సమాఖ్య సీసీ మల్లేశ్వరరావు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పీఆర్పీ రామకృష్ణ మహిళలకు ప్రకృతి వ్యవసాయం, రసాయనాల వాడకం వల్ల కలిగే ఆనారోగ్యం గురించి వివరించారు. వాతావరణ కాలుష్యం, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలు, పెరటి తోటల పెంపకం లాభాల గురించి మహిళలకు తెలియజేశారు.