గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం: సీఐ వాసు

68చూసినవారు
తాడికొండ మండల పరిధిలో గంజాయిపై ఉక్కు పాదం మోపుతామని తాడికొండ సీఐ వాసు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి మహిళలను అసభ్యంగా మాట్లాడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్