ఏపీలో ఇకపై హెల్మెట్ మస్ట్

71చూసినవారు
ఏపీలో ఇకపై హెల్మెట్ మస్ట్
ఏపీలో ద్విచక్రవాహనం నడిపే వారందరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని తేల్చి చెప్పింది. హెల్మెట్ లేకపోవడం కూడా మరణాలకు కారణమంటూ హైకోర్టులో న్యాయవాది తాండవ యోగేష్ పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్