అనుమానాస్పద మరణాలు.. కరాచీలో హై అలర్ట్

85చూసినవారు
అనుమానాస్పద మరణాలు.. కరాచీలో హై అలర్ట్
పాకిస్థాన్‌లోని కరాచీలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో కరాచీ నగరంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విగత జీవులుగా పడి ఉన్న 22 మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించారు. మంగళవారం ఒక్క రోజే 5 మృతదేహాలను గుర్తించారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మృతదేహాలు తమ వారివంటూ.. ఇప్పటి వరకు వారి బంధువులెవరు రాకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్